YCP MLA: నేను పార్టీ మారడం లేదు.. ఆర్టీవితో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌!

తాను టీడీపీ లో చేరుతానని వస్తున్న వార్తలను ఖండించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌. టికెట్ విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.

New Update
YCP MLA: నేను పార్టీ మారడం లేదు.. ఆర్టీవితో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌!

YCP MLA Purnachandra Prasad: ప్రత్తిపాడు సీటు మార్పుపై అధికారిక ప్రకటన లేదని ఆర్టీవితో అన్నారు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌. కేవలం మీడియాలో మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నానని అన్నారు. సీఎం జగన్‌ (CM Jagan) ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం అని అన్నారు. సీటు కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాను పూర్తి చేసినట్లు వెల్లడించారు. తాను పార్టీ మారతాననేది అవాస్తవం, తప్పుడు ప్రచారం అని పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. తెలుగు దేశంలోకి వెళ్లే ఆలోచన తనకు, కేడర్‌కు లేదు అని తేల్చి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై చెప్పిన విషయాలను కింది వీడియోలో చూడండి.

ALSO READ:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. గిడుగు రుద్రరాజు క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు