BREAKING : జగన్ కు తప్పిన ప్రమాదం

AP: జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.

BREAKING : జగన్ కు తప్పిన ప్రమాదం
New Update

Jagan Convoy Accident : జగన్ (Jagan) కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం (Kadapa Airport) నుంచి పులివెందులకు (Pulivendula) వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమ (Rayalaseema) కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. మరోవైపు నిన్న అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. ఈ రోజు స్పీకర్ ఎన్నికకు హాజరుకాలేదు. ఈరోజు అసెంబ్లిలో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు ఆయన్నపాత్రుడు (Ayyanna Patrudu).

Also Read : ‘గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి’

#pulivendula #ys-jagan #jagan-convoy-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe