Rajya Sabha: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు

లోక్‌సభలో పాస్‌ అయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఏ నెల 18 నుంచి 22 వరకు జరుగుతున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. బుధవారం మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో రాజ్యసభకు వెళ్లిన ఈ బిల్లుపై రాస్యసభ సభ్యులు చర్చించనున్నారు.

Rajya Sabha: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు
New Update

లోక్‌సభలో పాస్‌ అయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. రాజ్యసభలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు బిల్లుపై వారి అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగుతున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. బుధవారం మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో రాజ్యసభకు వెళ్లిన ఈ బిల్లుపై రాస్యసభ సభ్యులు చర్చించనున్నారు. అనంతరం ఎగువ సభలోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.

కాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించిన ఎంపీ కె. కేశవరావు బిల్లు అమలులో కేంద్రం అంచనా తప్పుగా వేసిందన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌, ప్రజాభిప్రాయ సేకరణ ఇవన్నీ పూర్తి కావాలంటే 2030 వరకు పడుతుంది. అంటే.. 2029మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు అసాధ్యం. అంతలేటు చేసేకన్నా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్‌ చేస్తే బిల్లు వెంటనే అమలు చేసే ఆస్కారం ఉంటుందని కేశవరావు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతే జనాభా లెక్కలు అనడం అర్థరహితం అని ఆయన విమర్శించారు.

telugu states MP's on women reservation bill.

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైసీపీ పార్టీ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అయితే.. న్యాయ శాఖ మంత్రిత్వ శాఖకు మా విజ్ఞప్తి ఒక్కటే. మహిళా రిజర్వేషన్‌లను రాజ్యసభ, శాసన మండళ్ళకి కూడా అమలు చేయాలి. ఆర్టికల్‌ 80, 171 చట్ట సవరణ ద్వారా రాజ్యసభ, శాసనమండళ్లల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్‌ కల్పించాలి. రాజకీయాల్లో మహిళా సాధికారతను పెంపొందించే ఈ సెప్టెంబర్‌ నెలను మహిళల చారిత్రక నెలగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు విజయసాయిరెడ్డి.

telugu states MP's on women reservation bill.

స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలకు అవకాశం ఇచ్చిన ఘనత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌దే అని చెప్పుకొచ్చారు. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ 33 శాతం కాదు 50 శాతం ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన మరో ఎంపీ పిల్లి సుభాష్.

telugu states MP's on women reservation bill.

మరోవైపు అసలు మాకు ఈ బిల్లు వద్దే వద్దు అంటూ మహిళా రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు స్థానం కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశామని, ఎవరికోసమైతే దీనిని తెస్తున్నారో

వారికే బిల్లులో చోటు లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఓబీసీ జనాభా ఉంటే.. వారికి చట్టసభల్లో కేవలం 22 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. దేశ జనాభాలో ముస్లిం మహిళల వాటా 7 శాతం, కానీ లోక్‌సభలో ముస్లిం ఎంపీలు 0.7 శాతం మందే ఉన్నారని అసదుద్దీన్ చెప్పారు. అలాంటప్పుడు వారికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరు? అని ఆయన నిలదీశారు

#womens-reservation-bill #members #rajya-sabha #debate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe