భారత్ లో తొలిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫి 2023 జార్ఖండ్ లోని రాంచీలో నేటి నుంచి నవంబర్ 5వరకు జరగనుంది. ఈ ట్రోఫికి తొలిసారిగా భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్ ఏడవ ఎడిషన్ లో టాప్ ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్ తొలిసారిగా కాంటినెంటల్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. రాంచీలో జరిగే టైటిల్ కోసం భారత్, జపాన్, చైనా, కొరియా, మలేషియా, థాయ్ లాండ్ జట్లు తలపడనున్నాయి. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫిలో జపాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. 2021లో కొరియాలోని డోంఘేలో కొరియాను 2-1తో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Women’s Hockey Asian Champions Trophy 2023: ఇవాళ్టి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ..!!
స్వదేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫిలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు ( అక్టోబర్ 27) రాంచీలో షురూ అవుతుంది. మొదటిరోజు థాయ్ లాండ్ జట్టుతో సవితా పూనియా కెప్టెన్సీలోని భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8.30గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
Translate this News: