JrNTR : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ అంతా తరలివస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తారక్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

JrNTR : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?
New Update

Nandamuri Balakrishna : సెప్టెంబర్ 1న జరగనున్న బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి టాలీవుడ్‌లోని అగ్రనాయకులు, దర్శకలు, నిర్మాతలు హాజరవుతారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌తో కలిసి హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇదే వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ 'బాబాయ్' ని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.గా

Also Read : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదు

ఎందుకుంటే గత కొంతకాలంగా నందమూరి హీరోల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య మధ్య అస్సలు పడటం లేదని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో బాలయ్య 50 ఏళ్ళ సినీ జర్నీ వేడుకకు తారక్ వస్తాడా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఈవెంట్ కు ఈ టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు మంచు కూడా హాజరు కానున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్లు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

#junior-ntr #nandamuri-balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe