Sangareddy: మద్యం మత్తులో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగా.. పుల్కల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్పూర్కు చెందిన మన్నె మాణయ్యకు భార్య, ఇద్దరు కూమార్తెలు, కొడుకు ఉన్నారు. మొదటి కూతురు సుకన్యకు పెళ్లి చేయగా ఆమెకు పాప జన్మించింది. భర్తతో విభేదాల కారణంతో ఆమె రెండేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటోంది. కుమారుడు ప్రవీణ్కుమార్కు వివాహమైంది. భార్యతో గొడవల కారణంతో ఆయన ఏడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి మాణయ్య ఇంట్లో భార్య ఇందిరమ్మ, కూతుళ్లు, మనవరాలితో కలిసి ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..Murder: కూతురిపై తండ్రి అత్యాచార యత్నం.. భార్య ఏం చేసిందంటే!
తాగిన మైకంలో కూతురిపై అత్యాచార యత్నం చేయబోయిన భర్త మాణయ్యను భార్య ఇందిరమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: