Mamitha Baiju: నయా క్రష్‌.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?

ప్రస్తుతం టాలీవుడ్ యూత్ కలల రాణి మమిత బైజూ. 'ప్రేమలు' మూవీతో తెలుగువారికి క్రష్‌గా మారిన మమిత అందం, అభినయానికి దర్శకుడు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు. అందుకే ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇంతకి ఎవరీ మమిత బైజూ? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Mamitha Baiju: నయా క్రష్‌.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?

Mamitha Baiju: ఇటీవలే రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేసిన చిత్రం 'ప్రేమలు'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు వారిని కూడా మెప్పించింది. కంటెంట్ బాగుంటే ఏ భాషలో తెరకెక్కిన సినిమానైన ప్రేక్షకులు ఆదరిస్తారని 'ప్రేమలు' మూవీతో మరో సారి రుజువైంది.

ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో నటించిన మమిత బైజూ అందం, అభినయంతో తెలుగు అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ అమ్మడు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ బ్యూటీ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read: RRR Movie: జపాన్‌కు రాజమౌళి.. అక్కడ ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ పీక్స్‌.. నిమిషంలోపే టికెట్స్‌ సేల్‌..!

మమిత బైజూ పై రాజమౌళి కామెంట్స్

తాజాగా 'ప్రేమలు' ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ హీరోయిన్ మమిత బైజూ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'గీతాంజలి' ఫేమ్ గిరిజ, ఫిదా ఫేమ్ సాయి పల్లవి లానే మమిత కూడా కుర్రాళ్ళ హార్ట్ త్రోబ్ అవుతుంది అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఇక రాజమౌళి కామెంట్స్ వైరల్ కావడంతో ఆమె గురించి గూగూల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. మమితా సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. న్యూ క్రష్ అంటూ కామెంట్స్ వెలువెత్తాయి. ఇప్పుడు మమితా సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము..

publive-image

మమిత బైజూ సినీ కెరీర్

2017 'సర్వోపరి పాలక్కారన్' సినిమాలో సహాయ నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ జావా, ఖో-ఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసంలో, కిలో మీటర్స్ అండ్ కిలో మీటర్స్, హానీ బీ 2 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖో-ఖో సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటిగా 'కేరళా క్రిటిక్స్ అవార్డు' అందుకుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మకు కోలీవుడ్ లో వరుస అవకాశాలువస్తున్నాయి. రీసెంట్ గా జీవీ ప్రకాష్ కు జంటగా నటించిన 'రెబల్' మూవీ మార్చి 22 న విడుదల కానుంది. అలాగే విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. మమితా తన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసింది. ఈ బ్యూటీ  కేరళలోని కొట్టాయంలో జన్మించింది.

Also Read: Kiran Abbavaram : గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం – రహస్య ఎంగేజ్మెంట్.. వైరలవుతున్న ఫొటోలు

Advertisment
తాజా కథనాలు