Raina: GOAT అనే పదం వినగానే అతనే గుర్తుకువస్తాడు..రైనా!

ధోనీపై సురేశ్ రైనా మరోమారు తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఇంగ్లాడ్ లో జరుగుతున్నలెజెండ్స్ ప్రపంచ కప్ లో ఓ యాంకర్ GOAT అంటే ఎవరు గుర్తుకువస్తారు అని రైనాను ప్రశ్నించింది.దానికీ రైనా తనకు ధోనీనే గుర్తుకు వస్తాడు అని తెలిపాడు.ఇది చూసిన ధోనీ ఫ్యాన్స్ రైనా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
Raina: GOAT అనే పదం వినగానే అతనే గుర్తుకువస్తాడు..రైనా!

Suresh Raina: సురేశ్ రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్‌కే (CSK) తరఫున ఆడాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా.. సురేశ్ రైనాకు ఇచ్చినంతగా ధోనీ (MS Dhoni) ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. రైనాను సంప్రదించిన తర్వాతే 2021 ఐపీఎల్‌లో ఉతప్పను ఆడించాలని ధోనీ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే భారత జట్టులో విరాట్ కోహ్లీ కంటే ముందు ధోనీ కెప్టెన్‌గా సురేశ్ రైనా వ్యవహరించాడు. 2015 ప్రపంచకప్ సిరీస్ వరకు సురేశ్ రైనా ప్రదర్శన తారాస్థాయికి చేరుకుంది. కానీ విరాట్ కోహ్లి పుంజుకున్న తర్వాత రైనా ఫామ్ కోల్పోయి భారత జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ధోనీపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడంలో రైనా ఎప్పుడూ విఫలం కాలేదు.

Also Read: 5000,00,00,000.. వామ్మో..ఇన్ని వేల కోట్లతో పెళ్లా..!

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలకే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుండి CSK వేలంలో రైనాను కొనుగోలు చేయనప్పటికీ సురేష్ రైనా ప్రతి మ్యాచ్  వ్యాఖ్యానంలో CSKకి మద్దతు ఇస్తున్నాడు. దీంతో రైనాపై సీఎస్‌కే అభిమానులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ స్థితిలో గోట్ ప్లేయర్ ఎవరన్నదానిపై ఇటీవల భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చర్చలో సురేష్ రైనా కూడా చేరాడు.

లీగ్ ఆఫ్ లెజెండ్స్ సిరీస్‌లో ఆడుతున్న సురేశ్ రైనా ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. GOAT అనే పదం వినగానే సురేష్ రైనా ఏ ఆటగాడు గుర్తుకు వస్తాడని ప్రశ్నించారు. దానికి సురేశ్ రైనా మాట్లాడుతూ ధోని పేరు వెంటనే గుర్తుకు వస్తుందన్నారు. రైనా విరాట్ కోహ్లీని (Virat Kohli) కింగ్ అని, శుబ్‌మాన్ గిల్‌ను "భవిష్యత్తు" అని బుమ్రాను "డెత్ ఓవర్ల రాజు" అని కూడా పిలిచాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు లెజెండ్స్ లీగ్‌లో భారత జట్టు సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడనుంది. ఈరోజు రాత్రి జరగనుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

Advertisment
తాజా కథనాలు