TS News: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..!

సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు ఆందోల్ గ్రామానికి వెళ్తుండగా..ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది.

Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై భయంకరమైన యాక్సిడెంట్.. యువకులు దుర్మరణం!
New Update

TS News:  ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం మన్సాన్ పల్లి శివారులో పెళ్లి బ్రుందంతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో 9 లక్షల ఓట్ల తొలగింపు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా.!

#road-accident #marriage-function #andol-mandal #sangareddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe