Ibrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి సంబంధించి ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇబ్రహీం హెలికాప్టర్ యాక్సిడెంట్ లో తమ ప్రమేయం ఏమీ లేదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీం రైసీ ప్రయాణించే హెలికాప్టర్ మే19న క్రాష్ అయి ఆయనతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, కొంతమంది అధికారులు మరణించారు. ఇరాన్ లోని తూర్పు అజర్ బైజాల్ ప్రాంతో చాపర్ యాక్సిడెంట్ కు గురైంది. అయితే ఈ ఘటనపై ఇరాన్ శ్రతు దేశమైన ఇజ్రాయిల్ స్పందిస్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయిల్ ప్రమేయం లేదని మీడియాతో వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Israel: ఇబ్రహీం మరణంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. హెలికాప్టర్ కూలిపోవడంలో..!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మరణంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం, ఇబ్రహీం మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
Translate this News: