కృష్ణా నదిలో కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరే సారే సమర్పించి.. చంద్రబాబు నాయుడు త్వరితగతిన విడుదల కావాలని కొల్లు రవీంద్ర నాయకత్వంలో బీసీ విభాగం సంఘాలు పెద్ద ఎత్తున జలదీక్ష చేశారు. కృష్ణ గోదావరి నదుల అనుసంధానం చేసి పవిత్ర సంగమం చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కోల్ల రవింద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి దీవెనలతో చంద్రబాబు నాయుడు తప్పకుండా బయటికి వస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నదుల అనుసంధానం చేసే కార్యక్రమం సాధ్యం కాదు. అటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారని కొల్లు గుర్తు చేశారు. కృష్ణా జలాలపై మనకున్న హక్కులను కోల్పోయామని ఆయన మండిపడ్డారు. భవిష్యత్ కాలంలో డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. సోమవారం న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం కొల్లు రవీంద్ర వ్యాఖ్యనించారు. కార్యకర్తలు కట్టుకున్నా.. డబ్బును అవినీతి డబ్బు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి శాశ్వత సమాధి కట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
పూర్తిగా చదవండి..vijayawada: చంద్రబాబు కోసం కృష్ణమ్మకు టీడీపీ నేతల సారె
చంద్రబాబు అక్రమ అరెస్ట్కు నిరసనగా జల దీక్షలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఉన్న గోదావరి కృష్ణ కలయిక వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు జల దీక్ష చేశారు.
Translate this News: