Vishaka Women Death: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్ధితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. మృతి చెందిన మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. అనుస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Vishaka Women Death: విశాఖలో దారుణం.. బట్టలు లేకుండా మహిళ డెడ్ బాడీ.. అసలేం జరిగిందంటే?
New Update

Vishaka: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్ధితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. మృతి చెందిన మహిళ ఒంటిపై బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపాలపట్నం ఆర్టీసీ డిపో ఎదురు బాలాజీ గార్డెన్స్‌లో ఈ ఘటన జరిగింది. స్ధానికుల ఫిర్యాదుతో వెంటనే ఘటనాస్ధలికి చేరుకున్నారు పోలీసులు. అనుస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు రాధ గాయత్రి(45)గా గుర్తించారు.

అయితే, గత మూడు రోజులుగా గాయత్రికి హెల్త్‌ బాగోలేదని తన స్నేహితురాలు కల్పన చెబుతోంది. పలుమార్లు ఫోన్‌ చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో గాయత్రి బాగోగులు తెలుసుకునేందుకు కల్పిన ఆమెను చూసేందుకు వెళ్లింది. అయితే, గాయత్రి రూమ్‌ అంత చికటిగా ఉండడంతో లైట్ వేసి చూసింది. అంతే, మృతి చెందిన గాయిత్రిని చూసి షాక్‌ అయింది. గాయత్రి రక్తపు మడుగులలో, శరీరంపై ఏ మాత్రం దుస్తులు లేకుండా విగితాజీవిగా కనిపించడంతో భయపడింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు గాయత్రి భర్త తన పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి దగ్గరకు వెళ్లాడు. భర్త లేని సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. అసలు గాయత్రికి ఏమైంది? గాయత్రిని ఎవరైన హత్య చేశారా ? అయితే హత్య చేసిందేవరు ? కుటుంబ తగధాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయత్రి మృతి చెందడంతో బాలాజీ గార్డెన్స్‌ లో టెన్షన్ వాతవరణం నెలకొంది.

Also Read : మిస్టరీగా భవ్యశ్రీ మృతి.. చంపింది ఆ ముగ్గురేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెరు?

#visakhapatnam #crime-news #andhra-pradesh-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe