Video Viral: స్పా సెంటర్‌గా మారిన స్కూల్‌.. పిల్లలతో ఇదేం పాడుపని

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. పక్కన మరో టీచర్‌ కూర్చొని చూస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ఇలాంటి పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

New Update
Video Viral..1

Video Viral

Video Viral: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల స్పా సెంటర్‌గా మారింది. ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తరగతి గదిలో టీచర్‌ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్‌ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


క్లాసులో తరగతులు చెప్పకుండా...

అక్కడ క్లాస్‌రూమ్‌లో ఓ టీచర్‌ నేలపై పడుకుని కనిపించింది. ఇద్దరు ప్రాథమిక స్థాయి విద్యార్థులు కాళ్లపై నుంచోని మసాజ్‌ చేయడం చూసిన వారంతా వీళ్లేం టీచర్లు అంటూ మండిపడుతున్నారు. క్లాసులో తరగతులు చెప్పకుండా ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు. 23 సెకన్ల వైరల్ వీడియోలో ఎరుపు సల్వార్‌లో ఒక యువతి టీచర్ కుర్చీపై కూర్చున్నట్లు కనిపించింది. అయితే స్కూల్ ఉద్యోగా లేక బయటి వ్యక్తినా అనేది తెలియదంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ఉన్నది కర్తార్‌పూర్ ప్రభుత్వ పాఠశాల అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి:  ఈ లక్షణాలు ఉంటే గుండెపోటు ఖాయమా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు