దహనసంస్కారాలకు దారి లేక!

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది.

దహనసంస్కారాలకు దారి లేక!
New Update

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం అతని కుటుంబ సభ్యులు పెద్ద సాహసాన్నే చేశారు. నిండుకుండలా పొంగుతున్న వాగును ప్రాణాలకు తెగించి ఈదుకుంటు దాటాల్సి వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో చోటు చేసుకుంది.

villagers and relatives swim in the overflowing stream for the last ritesof the deceased in siddipet dist

గ్రామంలో బాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం మరణించాడు. కానీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామంలోని వాగు ఉప్పొంగుతోంది. చనిపోయిన వ్యక్తికి దహనసంస్కారాలు చేయాలంటే ఆ వాగు దాటి ఆవతలికి వెళ్లాల్సిందే.

తప్పని సరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాడె మోసుకుంటూ వాగు దాటారు. ఇప్పటికే ఈ గ్రామానికి వంతెన నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడు.

ఇప్పటికైనా మా కష్టాలు చూసైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వాధికారులు తమ గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు.

#telangana #siddipet #floods #cremation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి