vijayawada: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని

చంద్రబాబు అరెస్ట్‌పై వరసగా పోసాని కృష్ణ మురళి సెటైర్లు పేల్చాతున్నారు. రెండు రోజుల క్రితం నారా భువనేశ్వరిపై సెటైర్లు వేసిన పోసాని.. తాగాజా నారా బ్రాహ్మణి కి సవాల్‌ విసిరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

vijayawada: ఏ దిక్కైనా వెళ్లండి..చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి: పోసాని
New Update

కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కొంత మంది మాట్లాడుతుంటే… వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి పోసాని కృష్ణమురళి నేడు కీలక చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

వెన్నుపోటు పొడిచావు

విజయవాడలో చంద్రబాబుపై ఏపీఎఫ్, డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దిక్కైనా వెళ్లండి బాగుపడతారు.. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అంటూ పోసాని సంచనల కామెంట్స్‌ చేశారు. రామారావును వెన్నుపోటు పొడిచావు ఒప్పుకోవు.. రామారావును చంపావు ఒప్పుకోవు.. రామారావును వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమే అంటే ఎలా..? అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బిచ్చి కొన్నది కూడా ప్రజలకోసమేనా..? అని అడిగారు. అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో...ఏడాదిన్నరో ఉండొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు. జైల్లో ఉండి ర్యాలీలు ...ధర్నాలతో నీకేం పని అంటూ మండిపడ్డారు. 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నావ్..!! దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు లేవని ఫైర్‌ అయ్యారు.

నారా బ్రాహ్మణి సమాధానం చెప్పాలి

చంద్రబాబు అవినీతి పరుడని మోదీ చెప్పారు. నువ్వు ఒప్పుకున్నావా.. ? అంటూ ప్రశ్నించారు. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకుకున్నది నిజాం కాదాన్నారు. నువ్వేమో మోదీని పర్సనల్‌గా తిట్టావు. దోమల మందు...మంచి దోమ తెరకొనిపెడతా...రెండు ఏసీలు కొనిపెడతా తీసుకెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబుకి ఇవ్వండి సెంటర్‌ వేశారు. నారా బ్రాహ్మణికి పోసాని కౌంటర్ ఇచ్చారు. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అన్నటుగా ఉన్నాయని అన్నారు. బ్రాహ్మణి నేను అడిగే నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ సవాల్‌ చేశారు. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు..?, మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు..?, మీ తాతయ్యను చంపిందెవరు..? జగన్ దగ్గర నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు..? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా అంటూ పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.

#vijayawada #key-comments #posani-krishna-murali #chandrababu-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి