Jagan : జగన్‌కు షాకిచ్చిన అధికారులు.. అర్థరాత్రి..

AP: జగన్‌కు విజయవాడ నగర పాలక సిబ్బంది షాకిచ్చారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ పేరును అర్థరాత్రి పోలీసుల భద్రత నడుమ తొలిగించారు. జగన్ పేరు తొలిగించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన చేపట్టనున్నారు.

New Update
Jagan : జగన్‌కు షాకిచ్చిన అధికారులు.. అర్థరాత్రి..

Vijayawada Municipal Officers Given Shock To YS Jagan : ఏపీ (Andhra Pradesh) లో జగన్‌ పేరు తొలగింపు వివాదం రాజేసుకుంది. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్ (YS Jagan) పేరును తొలిగించారు. అర్ధరాత్రి లైట్లు ఆపేసి జగన్ పేరును నగర పాలక సిబ్బంది తొలిగించింది. పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆర్పి జగన్ పేరు తొలగించడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2024లో అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) జగన్ ప్రారంభించారు. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే.

Also Read : నగరంలో రౌడీషీటర్‌ దారుణ హత్య

Advertisment
తాజా కథనాలు