Vijayawada Floods : కృష్ణా నదికి భారీ వరద (Heavy Flood) లతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై మాజీ సీఎం, వైయస్సార్సీపీ (YSRCP) అధ్యక్షుడు వైయస్ జగన్ (YS Jagan) నాయకులతో సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు జగన్ కు తెలిపారు.
పూర్తిగా చదవండి..Ex CM Jagan : వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన జగన్
వరద బాధితులకు వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ రూ.కోటి ప్రకటించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలో వరద పరిస్థితిపై ముఖ్యనేతలతో కలిసి జగన్ ఈరోజు సమీక్షించారు.
Translate this News: