విజయవాడలో ఘోరం! ప్రాణస్నేహితుడే ప్రాణం తీశాడు.. | Vijayawada Mu*rder News | RTV
విజయవాడలో వింత వ్యాధి.. సోకితే కాలు తీసేస్తారు.. జాగ్రత్త!
వరదల తగ్గడంతో కాస్త కుదురుకుంటున్న విజయవాడ వాసులను కొత్త వ్యాధి కలవర పెడుతోంది. ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే ఓ బాలుడి కాలు తొలగించారు. వరద నీరులో తిరగడం కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు వైద్యులు.
Vijayawada Floods: వరద బాధితుల ఇంటి వద్దకే మెకానిక్స్
బుడమేరు వరదల్లో విజయవాడలో సర్వం కోల్పోయిన వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వారిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులను అర్బన్ కంపెనీ యాప్ తో ఇంటివద్దనే మరమత్తులు జరిపించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం
Vijayawada Floods : వరద బాధితుడి పై చేయి చేసుకున్న వీఆర్వో!
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఆహారం,నీళ్లు అందడం లేదని వీఆర్వో విజయలక్ష్మిని వరద బాధితులు నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం నెలకొనగా..సహనం కోల్పోయిన వీఆర్వో యాసిన్ అనే బాధితుడి పై చేయి చేసుకున్నారు. ఈ విషయం కలెక్టర్ కి తెలియడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 67,69,70 గేట్ల కౌంటర్ వెయిట్ల రిపేర్లు పూర్తయ్యాయి. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు నేతృత్వంలో కేవలం 5 రోజుల్లోనే 3 గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం పూర్తి చేశారు.
Vijayawada : బుడమేరుకు ఏ క్షణమైనా వరద!
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్
AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు.
RP Sisodia: వరదొస్తుందని ముందే తెలుసు..సిసోడియా సంచలన వ్యాఖ్యలు
AP: విజయవాడలో వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. వరద గురించి చెప్పిన పట్టించుకోరని ప్రజలకు చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి.