Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!

ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది.

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!
New Update

ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది. కానీ చిన్నారి పరిస్థితి కూడా విషమం గా ఉన్నట్లు తెలుస్తుంది.

పిలిబిత్‌ కు చెందిన ఓ కుటుంబం వారణాసిలో తమ కుటుంబ సభ్యుల అస్థికలు కలిపి అక్కడి దేవాలయాల్లో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి- లక్నో హైవే పై వారణాసి జిల్లాలో జౌన్ పూర్ ప్రాంతంలో రోడ్డు మీద ఆగి వున్న లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. చనిపోయిన వారందరినీ కూడా పిండ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. చనిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

అమన్ (24), విపిన్ యాదవ్ (32), గంగాదేవి (48), మహేంద్ర పాల్ (43), చంద్రకాళి (40), దామోదర్ ప్రసాద్ (35), నిర్మలా దేవి (32), రామ్ భజన్ (55)గా గుర్తించారు.

కాగా ఈ ప్రమాదంలో బయటపడిన ఐదేళ్ల చిన్నారి శాంతి స్వరూప్‌ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. ఈ ఘోర ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

#up #car #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe