Vangaveeti Narendra: రంగాను చంపింది వాళ్లే.. వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణ

వంగవీటి మోహన రంగాను చంపిన పార్టీ టీడీపీ అని ఆయన సోదరుడి కుమారుడు నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో నాయకత్వ లోపం కారణంగా రంగా అభిమానులు కొందరు టీడీపీలో వెళ్లారన్నారు. కానీ వారంతా ఇప్పుడు మళ్లీ తన వద్దకు వస్తున్నారని చెప్పారు.

Vangaveeti Narendra: రంగాను చంపింది వాళ్లే.. వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణ
New Update

ఈ రోజు వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన సోదరుడి కుమారుడు నరేంద్ర ఈ రోజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రోజు రోజుకూ రంగా అభిమానులు రాష్ట్రంలో పెరుగుతున్నారన్నారు. వంగవీటి రంగా డబ్బున్న కుటుంబం నుంచో, సినిమాల్లో నుంచో వచ్చిన వ్యక్తి కాదన్నారు. కష్టం అని తన గుమ్మం ముందుకు వచ్చిన వారందరికీ ప్రాణాలకు తెగించి సాయం చేసిన ఓ మహానాయకుడని కొనియాడారు. రంగా ఓ భగవంతుడు లాంటి వారన్నారు.

ఇది కూడా చదవండి:

అయితే.. భగవంతుడి దగ్గరకు కొందరు అవకాశవాదులు కూడా వస్తారన్నారు. రంగా అభిమానులు ఎటు ఉంటారో ఈ సారి రాజకీయం కూడా ఈ సారి అటువైపే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రంగా పేరు చెప్పుకుని అనేక మంది బయటకు వస్తారన్నారు. రంగా పేరును జిల్లాకు పెట్టే వరకు తన ప్రయత్నం ఆగదని స్పష్టం చేశారు. ఆయన ఆశయాలు సాధించడమే తన లక్ష్యమన్నారు.

రంగాను చంపించిన పార్టీ తెలుగుదేశమని ధ్వజమెత్తారు. తమ కుటుంబం నుంచి నాయకత్వ లోపం ఉండడంతో రంగా అభిమానులు టీడీపీలోకి వెళ్లారన్నారు. వారంతా ఇప్పుడు తన వద్దకు వస్తున్నారన్నారు. ప్రజలు ఎప్పుడూ మంచి నాయకత్వాన్ని కోరుకుంటారన్నారు. అలాంటి మంచి నాయకత్వం దిశగా తమ అడుగులు ఉంటాయన్నారు. నరేంద్ర పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#vangaveeti-ranga #ap-elections-2024 #ysrcp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe