Vangaveeti Narendra: రంగాను చంపింది వాళ్లే.. వంగవీటి నరేంద్ర సంచలన ఆరోపణ
వంగవీటి మోహన రంగాను చంపిన పార్టీ టీడీపీ అని ఆయన సోదరుడి కుమారుడు నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తమ కుటుంబంలో నాయకత్వ లోపం కారణంగా రంగా అభిమానులు కొందరు టీడీపీలో వెళ్లారన్నారు. కానీ వారంతా ఇప్పుడు మళ్లీ తన వద్దకు వస్తున్నారని చెప్పారు.