Crime: బెంగళూరులో ఉజ్బెకిస్థాన్ మహిళ మర్డర్.. తలుపులు మూసి దారణం!

బెంగళూరులో దారుణం జరిగింది. టూరిస్ట్ గా వచ్చిన ఉజ్బెకిస్థాన్ కు చెందిన 37 ఏళ్ల జరీన్ అనే మహిళ ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Crime: బెంగళూరులో ఉజ్బెకిస్థాన్ మహిళ మర్డర్.. తలుపులు మూసి దారణం!

Uzbek Woman Found Dead at Bengaluru: బెంగళూరులో దారుణం జరిగింది. ఇటీవలే జార్ఘండ్ లో ప్రపంచ యాత్రికురాలైన ఫారిన్ మహిళపై సామూహిక హత్యాచారం జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. ఈ మేరకు టూరిస్ట్ గా వచ్చిన ఉజ్బెకిస్థాన్ (Uzbekistan) మహిళ ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

హోటల్ గదిలో శవమై..
ఈ మేరకు బెంగళూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ బుధవారం బెంగళూరులోని తన హోటల్ గదిలో శవమై కనిపించిందని తెలిపారు. మార్చి 5న బెంగళూరుకు వచ్చిన జరీన్‌ అనే మహిళ.. నగరంలోని శేషాద్రిపురం ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేసింది. అయితే ఆ రూమ్ నుంచి ఎలాంటి ఆర్డర్స్, అలికిరి లేకపోవడంతో సాయంత్రం 4:30 గంటలకు హోటల్ సిబ్బంది తలుపులు కొట్టి పిలిచారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సిబ్బంది మాస్టర్ కీని ఉపయోగించి తలుపులు తెరిచి చూడగా జరీన్ మృతి చెంది ఉన్నట్లు గమనించి వెంటనే సమాచారం అందించారని బెంగళూరు సెంట్రల్ డీసీపీ శేఖర్ హెచ్‌టీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Viral: పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి.. చంద్రబాబుపై దారుణమైన ట్రోలింగ్!

ఇక హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన జరిగినప్పుడు ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందం, పోలీసులు, డాగ్ స్క్వాడ్ సాయంతో జరీన్ బస చేసిన గదిని తనిఖీ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజీ, హోటల్ రిజిస్టర్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నాం. ఆమె ఏ వీసాపై వచ్చారు? ఎక్కువ కాలం ఎక్కడ గడిపిందనే కోణంలో ఆమె పాస్‌పోర్ట్‌ను దర్యాప్తు చేస్తున్నామని శేఖర్ హెచ్‌టి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు