Chandrayaan-3: అమెరికా నిపుణులు మన సాంకేతికతను అడిగారు.. సోమనాథ్ కీలక వ్యాఖ్యలు

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. కాలం మారిందని.. భారత్ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని అన్నారు.

New Update
Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే చంద్రయాన్-3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించినటువంటి అమెరికా అంతరిక్ష నిపుణలు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. కాలం మారిందని.. భారత్ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ పలు విషయాలు పంచుకున్నారు.

చంద్రయాన్-3’ వ్యౌమనౌకను తయారుచేసిన తర్వాత నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఆహ్వానించామని.. మేం వారికి చంద్రయాన్-3 గురించి వివరించినట్లు తెలిపారు. దీన్ని ఎలా రూపొందించాం? ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు? చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్‌ చేయబోతున్నాం ? తదితర విషయాలు చెప్పామని.. అంతా బాగానే జరుగుతుందంటూ వారు సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా రూపొందించారు? ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు అని కూడా అడిగినట్లు సోమనాథ్‌ గుర్తుచేసుకున్నారు.

Also read: 89 ఏళ్ల తాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. మరి బామ్మ ఏం చేసిందో తెలుసా..

అలాగే అంతరిక్ష సాంకేతికతలో ఇండియా మరింత అభివృద్ధి చెందేలా.. రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. చెన్నైలోని అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సంస్థలు రాకెట్‌లను తయారుచేస్తు్న్నాయని.. ఇలా దేశంలో సుమారు ఐదు కంపెనీలు రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని సోమనాథ్‌ చెప్పారు. ఇక చంద్రయాన్‌-3 విజయవంతమైనప్పుడు.. జాబిల్లిపైకి భారతీయుడిని ఎప్పుడు పంపిస్తారని ప్రధాని మోదీ అడిగినట్లు చెప్పారు. అయితే ఇక్కడ కూర్చున్న మీలోనే కొందరు ఆ పని సాధిస్తారని.. అలాంటి రాకెట్‌ను డిజైన్ చేస్తారని అక్కడున్న విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. చంద్రయాన్‌- 10 ప్రయోగం చేపట్టే సమయానికి మీలోనే ఒకరు రాకెట్‌లో చంద్రుని పైకి చేరుకుంటారని.. అందులో కూడా చాలావరకు మహిళ వ్యోమగామే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు