Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు !

అనంతపురం జిల్లా కనేకర్ మండలం తుంబిగనూర్‌ గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిందనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు !
New Update

Pesticides Mixed in Drinking Water: అనంతపురం జిల్లా (Anantapur) కనేకర్ మండలం తుంబిగనూర్‌ (Thumbiganur) గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే తుంబిగనూర్‌కు విడుదలయ్యే తాగునీటి సరఫరాను ఆపేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ తాగునీటి ట్యాంకుని పరిశీలించారు.

Also Read: విత్తనాలు, ఎరువుల కొరత రాకూడదు: మంత్రి అచ్చెన్న

అయితే శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పారిపోవడాన్ని కొందరు గ్రామస్థులు చూశారు. అనుమానంతో ఆ ట్యాంకు వద్దకు వచ్చి చూడగా.. లిక్విడ్‌ను గుర్తించారు. శనివారం ఉదయం ఊరందరికి ఈ విషయం తెలిసింది. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలిచి.. వైసీపీ ఓడిపోయిందన్న కోపంతోనే గుర్తుతెలియని వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ తాము ఈ నీరు తాగి ఉంటే పరిస్థితి ఘోరంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు.. వారిని దూరం పెట్టనున్న ప్రభుత్వం..!

#telugu-news #ananthapur #tdp-ysrcp #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe