/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/chandrababu-5-jpg.webp)
Attack On Chandrababu : ఏపీ(Andhra Pradesh) లో నేతలపై రాళ్ల దాడుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సభ(TDP Sabha) లో చంద్రబాబు(Chandrababu) పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి పరారు అయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శనివారం విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో సీఎం జగన్(CM Jagan) పై ఓ ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ ఎడమ కంటికి గాయం కాగా.. ఈరోజు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అలాగే ఈరోజు తెనాలిలో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక ఆగంతకుడు రాయి విసిరాడు. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు జనసైనికులు.