Minister Car Accident: కేంద్రమంత్రి కారుకు ప్రమాదం..మంత్రికి ఏమైందంటే!

కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్‌లో పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Minister Car Accident: కేంద్రమంత్రి కారుకు ప్రమాదం..మంత్రికి ఏమైందంటే!

Minister car Accident: కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్‌లో పర్యటనలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పిలిభిత్‌లో మంత్రి కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జితిన్ ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఘటన అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ ఘటన పిలిభిత్‌లోని మజోలా-విజ్తి రోడ్డులో ఉన్న బహ్రువా గ్రామంలో జరిగింది. కాన్వాయ్‌కి ఎస్కార్ట్‌గా ఉన్న ఓ కారు సడన్‌గా బ్రేకులు వేసింది. ఆ తర్వాత జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ కూడా సడెన్‌ బ్రేకు వేశాడు. దీంతో వెనకున్న మరో కారు మంత్రి కారును ఢీకొట్టింది. వాహన వేగం అంతగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా కాన్వాయ్ మొత్తం ఆగిపోవడంతో జితిన్ ప్రసాద్ తన కారులోంచి బయటకు వచ్చి తన కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు.

Also read: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

Advertisment
తాజా కథనాలు