Crime News: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో వరుసగా భారతీయుల విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరిజానా యూనివర్సిటిలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23),రోహిత్ మణికంఠ రేపాల (25) ఓ జలపాతంలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది.

AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!
New Update

అమెరికాలో వరుసగా భారతీయుల విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23),రోహిత్ మణికంఠ రేపాల (25) అమెరికాలోని ఆరిజానా యూనివర్సిటిలో చదువుతున్నారు. తమ చదువును ఇటీవలే పూర్తి చేసి ఎంఎస్ పట్టా కూడా పొందారు. ఈ క్రమంలోనే మే 8న వీళ్లు తమ స్నేహితులతో కలిసి ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతానికి వెళ్లారు.

Also Read: భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి

ప్రమాదవశాత్తు రాకేశ్‌, రోహిత్‌లు ప్రమాదవశాత్తు జలపాతంలో మనిగిపోయారు. దీంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారి కోసం గాలించగా.. ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత మరుసటి రోజు గజఈతగాళ్ల సాయంతో గాలించగా ఆ ఇద్దరి మృతదేహాలు లభించాయి. రాకేశ్‌రెడ్డిది ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు. రోహిత్‌ వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం వీరి మృతదేహాలు భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also read: గూగుల్ లే ఆఫ్ లు కొనసాగుతాయ్..స్పందించిన సుందర్‌ పిచాయ్‌..

#telugu-news #america #crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe