TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు అలిపిరి మెట్ల దగ్గర చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. చిరుత దాడుల నేపథ్యంలో భక్తులకు కర్రల పంపిణీని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భక్తులతో సంభాషించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ కావాలనుకున్న భక్తులకే కర్రలు ఇస్తామని.. భక్తుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాడుల నేపథ్యంలో భక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసమే కర్రలు ఇస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు టీటీడీ ఎప్పుడూ అండగానే ఉంటుందని పేర్కొన్నారు. అలిపిరి దగ్గర నుంచి కర్రలను నరసింహ స్వామి ఆలయం దగ్గర తిరిగి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు విధించిన ఆంక్షలు అలాగే కొనసాగుతాయని స్పష్టంచేశారు.
పూర్తిగా చదవండి..TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం
తిరుమల శ్రీవారి దర్శనార్థం నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు అలిపిరి మెట్ల దగ్గర చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. చిరుత దాడుల నేపథ్యంలో భక్తులకు కర్రల పంపిణీని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భక్తులతో సంభాషించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Translate this News: