TS MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణీ.. RTV ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు విచ్చలవిడిగా నగదు పంపకానికి తెర లేపినట్లు తెలుస్తోంది. వరంగల్ లో డబ్బుల పంపిణీ వ్యవహారానికి సంబధించిన దృశ్యాలు ఆర్టీవీకి చిక్కాయి. సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నారని చూసిన నేతలు పరారయ్యారు.

New Update
TS MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణీ.. RTV ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌

Telangana : ఈ రోజు జరుగుతున్న ఖమ్మం-నల్గొండ-వరంగల్ (Khammam-Nalgonda-Warangal) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (MLC By Elections) సందర్భంగా ఓటర్లకు (Voters) నగదు పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పార్టీల నేతలు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలోనే డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. RTV ఇందుకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్‌ సేకరించింది. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నారని చూసిన నేతలు పరారయ్యారు.

ఈ రోజు నార్కట్ పల్లిలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఆందోళనకు దిగారు. డబ్బుల పంపిణీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) నేతలు డబ్బులు పంచుతున్నారని ఆయన చెబుతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 15 మంది మృతి..

Advertisment
తాజా కథనాలు