ఇవాళే(ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. మరో రెండు మూడు నెలల్లో తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల సమయానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్నది పక్కన పెడితే ప్రస్తుతం మంత్రివర్గానికి ఇదే లాస్ట్ అసెంబ్లీ మీటింగ్ డే. అందుకే ఇవాళ గులాబీ సర్కార్కి కీలకం. ఎన్నికలకు ముందు జరగనున్న అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సీఎం కేసీఆర్(CM KCR) సభలో సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశముంది. ఈ ప్రసంగంలో కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నదానిపై యావత్ తెలంగాణ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఈ ప్రసంగంపైనే ఉంది. IR, PRC లాంటి వాటిపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని వారంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా? ఇవాళ అసెంబ్లీలో సీఎం ఏం మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ!
ఇవాళే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం ప్రసంగిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ, ఐఆర్ గురించి కీలక ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
Translate this News: