Kothagudem : లక్ష రూపాయల లంచం.. ఏసీబీకీ అడ్డంగా బుక్కైన ట్రాన్స్ కో ఏఈ!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ మద్దికొండ గ్రామ రైతు దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Kothagudem : లక్ష రూపాయల లంచం.. ఏసీబీకీ అడ్డంగా బుక్కైన ట్రాన్స్ కో ఏఈ!
New Update

TRANSCO AE : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్(Corrupt Officer) అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) కి చిక్కాడు. అశ్వరావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకళ్ల ఆదిత్య అనే రైతు(Farmer) కు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేశాడు ఏఈ శరత్. దీంతో రైతు ఆదిత్య ఏసీబీని ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Also Read : ఇకనుంచి TGతో వాహన రిజిస్ట్రేషన్లు.. కేంద్రం గెజిట్ జారీ

#ae-sarath-kumar #acb #kothagudem
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe