Mumbai : దేశ వ్యాప్తంగా వానలు బాగా కురుస్తున్నాయి. ఉత్తర భారత దేశాన్ని (North India) వర్షాలు (Rains) వణికిస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్ తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలకు ఐఎండీ (IMD) అధికారులు రెడ్ అలర్డ్ జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
పూర్తిగా చదవండి..Heavy Rains In Mumbai : ముంబైను ముంచెత్తిన వర్షాలు
ముంబైలో కుండపోత వాన కురుస్తుంది. సుమారు 6 గంటల నుంచి వర్షం ఆగకుండా పడుతుంది. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్ను అధికారులు ఆపేశారు.
Translate this News: