Tollywood : మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే..

కొత్తగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లకు అవకాశం ఇస్తున్న నిర్మాతలు.. తమ ప్రొడక్షన్ హౌజ్ లోనే వరుసగా రెండు లేదా మూడు సినిమాలు చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా రెండు, మూడు సినిమాలు ఒకే బ్యానర్ లో చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Tollywood : మన హీరోయిన్స్  ఒకదానికి  కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే..
New Update

Tollywood Heroines : సాధారణంగా ప్రాడక్ట్స్(Products), బట్టలు(Dresses), లేదా ఇంట్లోని ఏవైనా వస్తువులకు వన్ ప్లస్ వన్ ఆఫర్(One + One Offer) ఉండడం సహజం. కానీ ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల(Cinema Heroines) కు కూడా ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నారు నిర్మాతలు. ఒక సినిమా చేస్తే మరో సినిమా కూడా ఛాన్స్. అదేంటి అనుకుంటున్నారా..? ఒక ప్రొడక్షన్ హౌజ్ తో.. ఒక సినిమా చేసిన హీరోయిన్ మళ్ళీ అదే నిర్మాణ సంస్థతో రెండో లేదా మూడు సినిమాలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు నిర్మాతలు. గతంలో ఎప్పుడో ఇలాంటి విధానం ఉండేది. మళ్ళీ అది రిపీట్ అవుతోంది. లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు అందరు హీరోయిన్స్ ఈ రకమైన అగ్రిమెంట్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఇలా ఒకే బ్యానర్ లో రెండు మూడు సినిమాలు చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాము..

Also Read : Samantha : ఫెమినా కవర్ పేజ్ కోసం.. సామ్ హాట్ ఫోటో షూట్

  • యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) వరుసగా రెండు సినిమాలు సితార ఎంటర్ టైన్మెంట్స్(Sitara Entertainments) నిర్మాణ సినిమాతో చేసింది. మొదటగా 'ఆదికేశవ' సినిమాకు ఆఫర్ ఇచ్చిన ఇదే నిర్మాణ సంస్థ.. మళ్ళీ 'గుంటూరు కారం' మూవీలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్ ఇచ్చింది.
  • డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాణ సంస్థలోనూ కథానాయికలు రిపీట్ అవ్వడం జరిగింది. ఈ బ్యానర్ లో బాలీవుడ్ బ్యూటీ వరుసగా రెండు సినిమాలు చేసింది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ.
  • మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో బేబీ సినిమా చేసిన లేటెస్ట్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. తన నెక్స్ట్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నారు.

publive-image

  • కర్లీ బ్యూటీ అనుపమ(Curly Beauty Anupama) విషయంలో కూడా ఇదే జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో కార్తికేయ 2, ఈగల్ సినిమాలు చేసిన ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థలో టిల్లు స్క్వేర్‌ మూవీ చేస్తోంది.
  • యంగ్ బ్యూటీ నేహా శెట్టి ముందుగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన డీజే టిల్లు మూవీ లో నటించింది. ఆ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో రాబోతున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటిస్తుంది.
  • మీనాక్షి చౌదరి .. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గుంటూరు కారంలో నటించిన ఈ బ్యూటీ.. మళ్ళీ అదే బ్యానర్ లో నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాకు కూడా తీసుకున్నారు. అంతే కాదు ఇదే బ్యానర్ లో రాబోతున్న వరుణ్ తేజ్ మట్కా.. విశ్వక్ సేన్ చేయబోయే నెక్స్ట్ మూవీలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్ ఇచ్చారు.

Also Read: NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌”.. బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

#tollywood-actress #telugu-film-industry #tollywood-heroines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి