Allu Arjun : 'కాంతారా' హీరోకి నేషనల్ అవార్డు.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..! కన్నడ హీరో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ ఆయనను అభినందించారు.“నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డుకు అర్హుడు' అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. By Anil Kumar 17 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Tollywood Actor Allu Arjun : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతారా'చిత్రానికి నేషనల్ అవార్డు వరించడంతో రిషబ్ శెట్టికి సినీ సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రిషబ్ శెట్టిని అభినందించారు. “నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియాలో బన్నీ పేర్కొన్నారు. ఈ పోస్ట్కు రిషబ్ శెట్టి ‘థాంక్యూ బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు. Also Read : ‘తంగలాన్’ పార్ట్ – 2.. అదిరిపోయే అప్డేట్ షేర్ చేసిన విక్రమ్..! 'కాంతారా' కు బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు." ‘నా ప్రయాణంలో భాగమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్కు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూపించిన ఆదరణ మర్చిపోలేను. దీనివల్ల నా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి కష్టపడి పనిచేస్తాను. అత్యంత గౌరవంతో ఈ అవార్డును కన్నడ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను" అని అన్నారు. #allu-arjun #rishab-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి