తెలంగాణ ఎన్నికల్లో 24గంటల కరెంట్ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య విమర్శలకు దారి తీసింది. తాము కూడా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పినా బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ గెలుస్తే 3గంటల కరెంట్ మాత్రమే సాగుకు అందుతుందని కేసీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలంతా ప్రచారం చేశారు. కర్నాటకలో 5గంటల కరెంట్ మాత్రమే ఉందని ప్రచారం చేశారు. అయినా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. 24గంటల కరెంట్ అందిస్తామని భేటీ తర్వాత, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
Translate this News: