అక్కను వేధిస్తున్నారని బావ కుటుంబంపై దారుణం.. ఏం చేశారంటే

అక్కను వేధిస్తున్నారనే కోపంతో బావ, అతని తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపిన సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో చోటుచేసుకుంది. ఈ హత్యలకు పాల్పడిన మాధురి, సోదరుడు శ్రీనివాసరావు, తండ్రి సుబ్బారావు ముప్పాళ్ల పీఎస్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

అక్కను వేధిస్తున్నారని బావ కుటుంబంపై దారుణం.. ఏం చేశారంటే
New Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు.  రక్తపు మడుగులో ఉన్న శవాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

Also read : రూ.350 కోసం మర్డర్ చేసిన బాలుడు.. శవం ముందే డాన్స్‌ చేస్తూ

గురజాల డీఎస్పీ పల్లపురాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన మృతుడు నరేష్ కు గతంలో ప్రియాంకతో పెళ్లి అయింది. అయితే భార్యభర్తల మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. దీంతో నరేష్‌ ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన మాధురిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మాధురికి ఆరోగ్యం బాగోలేకపోయినా పొలం పనికి వెళ్లాలని నరేష్ కోరాడు. ఈ విషయంపై ఇద్దరిమధ్య గొడవ జరిగింది. గతంలో కూడా నరేష్, మాధురిలు గొడవ పడేవారు. తన సోదరితో గొడవ పడొద్దని చెప్పిన బావమరిది శ్రీనివాసరావును నరేష్ గతంలో కొట్టాడు. ఈ క్రమంలోనే మాధురి మళ్లీ గొడవ జరిగిందని చెప్పడంతో తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావులు కలిసి బైక్ పై కోనంకి వచ్చారు. మాటా మాటా పెరగడంతో కత్తితో దాడిచేసి ముగ్గురిని‌హత్య చేశారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), నరేష్‌ (30)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్యలకు పాల్పడిన సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు ముప్పాళ్ల పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

#palnadu #three-people #murdered
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe