NASA : దూసుకొస్తున్న మూడు గ్రహశకలాలు!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసా వెల్లడించింది.

New Update
NASA : దూసుకొస్తున్న మూడు గ్రహశకలాలు!

Asteroids Coming To Earth : అమెరికా (America) అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది.

అవి భూమికి బాగా దగ్గరగా వస్తున్నప్పటికీ, వాటి నుంచి ముప్పు ఏమీ ఉండదని నాసా పేర్కొంది. ఈ మూడు గ్రహశకలాల్లో అన్నింటి కంటే పెద్దది కేహెచ్3-2024 అని, ఇది 610 అడుగులు ఉంటుందని నాసా వివరించింది. ఇది పొడవైన భవనం అంత పరిమాణంలో ఉంటుందని వెల్లడించింది. కేహెచ్3 గ్రహశకలం ఆగస్టు 10వ తేదీన భూమికి 5.6 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి వస్తుందని తెలిపింది.

మిగతా రెండు గ్రహశకాల్లో ఒకటైన పీకే1-2024... కేవలం 110 అడుగులతో ఓ చిన్న విమానం సైజులో ఉండొచ్చని, ఇది భూమికి 6.4 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా వస్తుందని నాసా అధికారులు వెల్లడించారు. దీంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది.

మూడో గ్రహశకలం (Asteroids) ఓఎన్2-2024 ఆగస్టు 12న భూమికి దగ్గరగా వస్తుందని, 120 అడుగులు ఉండే ఈ శకలం భూమికి 6.8 మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా రానుందని నాసా వివరించింది. ఇది కూడా భూమిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవని నాసా వివరించింది. అయితే ఎందుకైనా మంచిందని భూమి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు గ్రహశకలాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నాసా వివరించింది.

Also read: ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Advertisment
తాజా కథనాలు