దసరా పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ప్రజలు తమ తమ ఊర్లకు వెళ్తుంటారు. దీంతో కాలనీలన్నీ నిర్మాణుష్యంగా మారుతాయి. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. దసరాకు తోడు ఎన్నికలు ఉండటంతో పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఊరెళ్తున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ కమిషన్ చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..TS Police Warning: పండుగకు ఉరెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే మీ ఇల్లు ఖాళీ..!!
దసరా పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో ప్రజలంతా తమ తమ ఊళ్లకు వెళ్తున్నారు. పండగ సీజన్ కదా..దొంగలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. దాని కోసం డబ్బు కావాలి. అందుకే పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లపై కన్నేస్తారు. ఉన్నదంతా దోచేస్తుంటారు. ఇంతకుముందు అయితే ఇలా పండగల సమయంలో పోలీసులు ఇళ్లపై దృష్టి సారించేవారు. దొంగతనాలు జరగకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం. పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఇది దొంగలకు మంచి సమయం. దొరికనకాడికి దోచుకెళ్తారు. మీరు ఇలా వెళ్లాగానే...వాళ్లు అలా వచ్చేస్తారు. అందుకే పండగకు ఊరెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
Translate this News: