Khammam: ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్..పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ

సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ జరిగింది.రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి మరీ నిన్న రాత్రి ఒంటిగంటసమయంలో దారి దోపిడీ చేశారు. నిన్న ఒక్కరోజే ఏపీ, తెలంగాణలోని పలు రైళ్లలో ఓ ముఠా ఈతరహా దారిదోపిడీలకు పాల్పడింది.

New Update
Khammam: ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్..పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ

ఖమ్మం జిల్లా చింతకాని దగ్గర రైలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి మరీ దోపీడీ చేసిందో ముఠా.పలువురు ప్రయాణికుల బంగారు ఆభరణాలు, నగదు, బ్యాగులు చోరీ చేశారు.ప్రతిఘటించిన ప్రయాణికులపై దాడిచేసేందుకు కూడా దొంగలు వెనుకాడలేదని చెబుతున్నారు. పద్మావతి, ధర్మవరం ఎక్స్ ప్రెస్, తిరుపతి స్పెషల్ ట్రైన్ లలో ఒకే తరహాలో దారి దోపిడీ జరిగింది. ఒకేరోజులోనే ఈ దొంగతనాలు జరగడం గమనార్హం.దీనిపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Pm Modi:జీ7 కోసం ఇటలీకి బయలుదేరిన ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు