Ram Mohan Naidu: 21 సార్లు జై శ్రీరామ్ అని రాసి బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు!

తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాబు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టారు.అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు రామ్మోహన్ నాయుడు ఒక పేజీలో 21 సార్లు 'ఓం శ్రీరాం' అని రాశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

New Update
Ram Mohan Naidu: 21 సార్లు జై శ్రీరామ్ అని రాసి బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు!

Minister Kinjarapu Ram Mohan Naidu: దేశంలోని 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 293 సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 9వ తేదీన బాధ్యతలు స్వీకరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా రామ్మోహన్ నాయుడు పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పౌర విమానయాన శాఖను కేటాయించారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కరోనా కాలం తర్వాత విమాన టిక్కెట్ల ఛార్జీలు పెరిగాయని ప్రజలు నివేదిస్తున్నారని, దాని గురించి తెలుసుకోవడానికి తాము సంప్రదింపుల సమావేశాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. సామాన్యులకు సవాల్‌గా ఉన్న టికెట్ ధరను కూడా తగ్గిస్తామన్నారు.

Also Read: ‘ఆడుదాం ఆంధ్రా’.. రోజా రూ.100 కోట్లు కొట్టేసిందా? సీఐడీకి ఫిర్యాదు

సామాన్యులకు విమానయానం అందించాలన్నదే తన అభిమతమని, ప్రధాని మోదీ తనపై బృహత్తరమైన బాధ్యతను అప్పగించారని రామ్‌మోహన్‌నాయుడు అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు రామ్మోహన్ నాయుడు ఒక పేజీలో 21 సార్లు 'ఓం శ్రీరాం' అని రాశారు. ఓం శ్రీరామ్ అని రాయమని తన తల్లి సూచించిందని రామ్మోహన్ నాయుడు చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు