CRIME: కరీంనగర్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిని కత్తితో పొడిచి

కరీంనగర్ లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తనతో ప్రేమ, పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో కొత్తపల్లికి చెందిన బొద్దుల సాయి 26ఏళ్ల యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. స్థానికులు అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
CRIME: కరీంనగర్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిని కత్తితో పొడిచి

CRIME:  మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఇష్టం లేదని చెప్పినా వినకుండా అమ్మాయి వెంట పడి వేధించిన దుర్మార్గుడు చివరకు తన కక్ష తీర్చుకున్నాడు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే అక్కసుతో యువతి కుంటుంబాన్ని వేధించాడు. అయినా తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. సమయకోసం వేచి చూసి యువతిపై విచక్షణ రహితంగా దాడిచేసిన భయంకరమైన ఘటన కరీనంగర్ జిల్లాలో జరిగింది.

కరీంనగర్‌ (Karimnagar)  జిల్లా కొత్తపల్లి మండల పోలీసులు  (Police) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి చెందిన యువతి (26) ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె ఇంటికి దగ్గరలో ఉంటున్న బొద్దుల సాయి (Sai)అనే యువకుడు ఆమెను కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. దీంతో తనకు ఇష్టం లేదని అమ్మాయి చెప్పినా వినకుండా విసిగించాడు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు అమ్మాయి విషయం చెప్పడంతో పెద్దల సమక్షంలో పిలిపించి మాట్లాడారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా.. పంచాయితీ పెట్టి మందలించారు.

ఇది కూడా చదవండి : CRIME : కన్న తండ్రే కామాంధుడు.. తల్లితో కలిసి కూతురిపై దారుణం

అయితే దీనిని మనసులో పెట్టుకుని తన పరువు తీశారనే కోపంతో రగిలిపోతున్న సాయి.. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని, లేదంటే ఊరుకోనంటూ తండ్రి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపించాడు. అయినా యువతి పేరెంట్స్ స్పందించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో యువతి పేరెంట్స్ లేని విషయం గమనించి సాయంత్రం అక్కడకు వెళ్లిన సాయి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో గొడవకు పడ్డాడు. యువతి మరోసారి ఇష్టం లేదని వాదించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. సాయిని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చేయి తెగింది. దీంతో పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరకోగానే సాయి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయలైన అమ్మాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు, ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. ఇక ఈ ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాలు యువతి నుంచి సేకరిస్తున్నామని, పరారిలో ఉన్న సాయిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు