Crime: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఓ వ్యక్తి భార్యను చంపిన 2013 కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే కారణంతో 2013లో రజినీని కత్తితో పొడిచి చంపేశాడు బాలకృష్ణ. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లిలో జరిగింది. By srinivas 14 Feb 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ లో ఓ వ్యక్తి భార్యను చంపిన 2013 కేసులో నాంపల్లి కోర్టు (Nampally court) సంచలన తీర్పు వెల్లడించింది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2013లో అచ్చయ్య నగర్ లో కొంతకాలంగా రజిని (Rajani), జి. బాలకృష్ణ (Balakrishna) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే తన అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే కారణంతో రజినీని కత్తితో పొడిచి చంపేశాడు బాలకృష్ణ. ఇది కూడా చదవండి : Telangana: సిగ్గు, జ్ఞానం, బుద్ధి లేదు.. బీఆర్ఎస్ కు పుట్టగతులుండవు: కాంగ్రెస్ మంత్రులు అయితే ఈ సంఘటన 2013లో జరగగా.. 11 ఏళ్ల అనంతరం బుధవారం దీనిపై తుది విచారణ చేపట్టిన నాంపల్లి మూడవ అడిషనల్ మెట్రోపాలిటెన్ కోర్టు నిందితుడు బాలకృష్ణకు జీవిత ఖైదు విధించింది. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. #sentenced-to-life-imprisonment #husband-who-killed-his-wife #nampally-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి