AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్, బిసి జనార్ధన్ రెడ్డి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

AP : ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మంత్రులు.. రూ. 10 లక్షల చెక్కు అందజేత
New Update

Kurnool : ఏపీ (Andhra Pradesh) లో ముచ్చుమర్రి బాలిక హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. మృతదేహాన్ని మల్యాల లిప్ట్‌ కెనాల్‌లో పడేశారు. ఈ ఘటన జరిగి వారం గడిచిన డెడ్‌బాడీ ఇంకా దొరకలేదు. అయితే, తాజాగా బాలిక కుటుంబాన్ని జిల్లా మంత్రులు ఫరూక్ (Farooq), బిసి జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy) పరామర్శించారు.

Also Read: పాడె మోసి గురు భక్తిని చాటుకున్న మాజీ మంత్రి కాకాణి..!

బాలిక తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. సొంతింటి నిర్మాణం, పిల్లలు అంబేద్కర్ గురుకుల పాఠశాల (Ambedkar Gurukula School) లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

#ambedkar-gurukula-school #bc-janardhan-reddy #kurnool-district #andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి