CM Revanth: రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని తెలిపారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
పూర్తిగా చదవండి..Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ రెడీ!
పంట రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్నారు. లబ్ధిదారుల పూర్తి డేటా సేకరించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
Translate this News: