Boat: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు!

ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది.

New Update
Boat: సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు!

ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్న మత్సకారుల పడవ సముద్రంలో బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి సముద్రంలో బోటు ఆగిపోయింది. ఆ సమయంలోనే పెద్ద అలల తాకిడికి బోటు ఒక్కసారిగా తిరగబడింది.

బోటు సముద్రంలో లో మునిగిపోతుండడంతో.. హాహాకారాలు చేస్తున్న 6 గురు మత్సకారులను రిలయన్స్ రిగ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. బోటు బోల్తా విషయం తెలిసిన భైరవపాలెం, సావిత్రి నగర్‌ కు చెందిన మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.

మత్స్యకారులు మంగళవారం నుండి సముద్రంలో సుమారు ఇరవై మైళ్ల దూరంలో రిగ్ వద్దనే చిక్కుకుపోవడంతో వారిని తీసుకువచ్చేందుకు స్థానిక మత్సకారులు ప్రయత్నిస్తున్నారు. అలలు భారీగా ఎగసిపడడం, వేగంగా గాలులు వీస్తూండడంతో మత్య్సకారుల వద్దకు మత్స్యకారులు చేరుకోలేకపోతున్నారు.ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే తమవారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Also read: నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు