Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త!

హైదరాబాద్‌ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం నాడు మాట్లాడుతూ.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

New Update
Hyderabad : హైదరాబాద్ వాసులకు TGRTC అదిరిపోయే శుభవార్త!

TGRTC : హైదరాబాద్‌ (Hyderabad) వాసులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శనివారం నాడు మాట్లాడుతూ.. ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్-సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24 ఈ) లో 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. సోమవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

ఈ బస్సులు ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి ఏఎస్ రావు నగర్, సైనిక్ పురి, అమ్ముగూడ, లాల్ బజార్, కర్ఖన, జేబీఎస్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని తెలిపారు. తిరిగి అదే మార్గంలో ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ కి వెళ్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సర్వీసులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీజీ ఆర్జీసీ సంస్థ కోరుకుంటోందని అన్నారు.

Also read: ఏపీతో తెగిన ఉమ్మడి బంధం.. హైదరాబాద్‌ ఇక పూర్తిగా తెలంగాణకే!

Advertisment
తాజా కథనాలు