Srinagar: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి!

జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.

New Update
Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

Srinagar: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ జిల్లా కోకెర్‌నాగ్ అహ్లాన్ గగర్‌మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తుండగా అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీలను గమనించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో భద్రతా బలగాలు అటాక్ చేశాయని, దీంతో తీవ్ర కాల్పులకు దారితీసిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మరణించారని చెప్పారు. ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించామని, ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు