Election Campaign : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి సినీ తారలు అందరూ కదలి వస్తున్నారు. ఇప్పటికే పవన్ తరుఫున ప్రచారం నిర్వహించేందుకు రంగంలోకి మెగా హీరోలు కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతుంది.
పూర్తిగా చదవండి..Sai Dharam Tej : ఎన్నికల ప్రచారం లో సాయిధరమ్ తేజ్ కు తప్పిన ప్రమాదం!
పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయి తేజ్పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు డ్రింక్ బాటిల్ తో దాడికి దిగారు. అయితే, ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్కు తృటిలో ప్రమాదం తప్పింది. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యింది.
Translate this News: