నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత..ఏపీ వర్సెస్ తెలంగాణ.! నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పటికే 13 గేట్లు స్వాధీనం చేసుకున్న ఏపీ అధికారులు.. కుడి కాలువ నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..అయితే, మోటార్లకు కరెంట్ నిలిపివేశారు తెలంగాణ అధికారులు. By Jyoshna Sappogula 30 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nagarjuna Sagar Dam: తెలంగాణలో ఎలక్షన్ హడావిడి నడుస్తోంటే.. ఇంత సడన్ గా నాగార్జున సాగర్ పై ఇప్పుడు వివాదం ఏంటి..? సాగర్ డ్యాంపై ఏపీ పోలీసులు అర్థరాత్రి ఎందుకు ప్రవేశించారు? ఏపీ ప్రభుత్వం ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి కారణం ఏంటి? నాలుగున్నరేళ్లుగా లేని అలజడి ఎన్నికల వేళ ఎందుకు? దాడి వెనుక కుట్ర ఎవరిది? అమలు చేస్తోందెవరు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. నాగార్జున సాగర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది..ఇప్పటికే 13 గేట్లు స్వాధీనం చేసుకున్న ఏపీ అధికారులు.. కుడి కాలువ నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు..అయితే, మోటార్లకు కరెంట్ నిలిపివేశారు తెలంగాణ అధికారులు. దీంతో ఏపీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈ ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో మంత్రి అంబటి ట్వీట్ సంచలనంగా మారింది. త్రాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి నేడు నీరు విడుదల చేయనున్నామని ట్వీట్ చేశారు. త్రాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి నేడు నీరు విడుదల చేయనున్నాము ! — Ambati Rambabu (@AmbatiRambabu) November 30, 2023 అసలేం జరిగిందంటే..? గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్కు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. Also Read: ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు #andhra-pradesh #telangana #nagarjuna-sagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి