Telangana : తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఇవే చివరివి!

మండే ఎండలతో మంట పుట్టించిన భానుడు ప్రస్తుతం చల్లబడ్డాడు. అయితే వీటికే ప్రజలు సంతోషపడాల్సిన అవసరం లేదని ...ఎండలు మరోసారి విజృంభించి తాట తీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

Telangana : తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు చేరిన ఎండలు.. ఇవే చివరివి!
New Update

Temperature In Telangana : గత వారం రోజులుగా హైదరాబాద్‌ (Hyderabad) తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం (Weather) ఒక్కసారిగా చల్లబడింది. మండే ఎండలతో (Heat) మంట పుట్టించిన భానుడు ప్రస్తుతం చల్లబడ్డాడు. అయితే వీటికే ప్రజలు సంతోషపడాల్సిన అవసరం లేదని ...ఎండలు మరోసారి విజృంభించి తాట తీస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

వర్షాలు ఆగిపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని వివరించింది. అయితే, వచ్చే నాలుగు రోజులు మాత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. గురువారం వరకు వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మాత్రం వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నుంచి 24 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది.

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మళ్లీ 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు (IMD) అంచనా వేస్తున్నారు. దీంతో మళ్లీ వడగాలులు మొదలవుతాయి. వేసవిలో ఇదే చివరి దశ అవుతుందని పేర్కొన్నారు.

Also read: ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి…బయటకు వచ్చిన సీసీ ఫుటేజీలు!

#rains #heat #telangana #imd #temperatures
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe